మహారాష్ట్ర ప్రైమరీ స్కూళ్లలో హిందీ తప్పనిసరి

మహారాష్ట్ర ప్రైమరీ స్కూళ్లలో హిందీ తప్పనిసరి
  • వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి అమలు

ముంబై: మహారాష్ట్రలో నూతన జాతీయ విద్యావిధానం(ఎన్ఈపీ 2020)ని వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా మరాఠీ, ఇంగ్లిష్​ మీడియం స్కూళ్లలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేసింది. థర్డ్​ ల్యాంగ్వేజ్​గా దీన్ని బోధించనున్నారు. 

ఎన్ఈపీలోని కరిక్యులమ్​ను దశలవారీగా అమలు చేస్తామని పేర్కొంది. తొలుత వచ్చే ఏడాది ఫస్ట్​ క్లాస్​లో దీన్ని ప్రవేశపెట్టి.. 2028–29 నాటికి అన్ని  క్లాస్​లకు విస్తరించనున్నారు. భాషా విధానంలో భాగంగా హిందీని థర్డ్​ ల్యాంగ్వేజ్​గా కంపల్సరీ చేశారు. ఎన్ఈపీ, హిందీ బోధన కోసం టీచర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని సర్కార్​ నిర్ణయించింది.  

‘‘ప్రస్తుతం ఉన్న 10+2+3 ఫార్మాట్​  స్థానంలో నేషనల్​ ఎడ్యుకేషన్​ పాలసీ–2020ని అమలు చేయాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా  5+3+3+4 ఫార్మాట్​ను అడాప్ట్​ చేసుకుంటున్నాం. ఇది క్రమంగా అమలులోకి తెస్తాం” అని మహారాష్ట్ర స్టేట్​ ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్​ డిప్యూటీ సెక్రటరీ తుషార్​ మహాజన్​ పేర్కొన్నారు.