SSMB29 Story: రాజమౌళి కాన్సెప్ట్ అదిరింది..వందల ఏళ్ల క్రితం స్టోరీతో మహేష్ బాబు సినిమా!

SSMB29 Story: రాజమౌళి కాన్సెప్ట్ అదిరింది..వందల ఏళ్ల క్రితం స్టోరీతో మహేష్ బాబు సినిమా!

ప్రస్తుతం ఇండియా నుండి వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ హైపుడ్ మూవీ ఏదైనా ఉందంటే అది మహేష్ బాబు (Mahesh babu), రాజమౌళి(Rajamoulli) కాంబోలో వస్తున్న మూవీ (SSRMB29) అని చెప్పాలి. మూవీ ప్రకటన తప్ప ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా రాకపోయినా..ఇండియన్ సినీ ఫ్యాన్స్ వేరే లెవెల్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎంతలా అంటే.. 

టాలీవుడ్ సినీ చరిత్రలో అపజయం లేని డైరెక్టర్గా చెరగని ముద్ర వేశారు దర్శక ధీరుడు రాజమౌళి. అలాగే ప్రతి ఒక్కరి కలల రాజకుమారుడిగా గుర్తింపు పొందారు మహేష్ బాబు. దీంతో వీరిద్దరి ప్రాజెక్ట్ పై చిన్న న్యూస్ తెలిసిన చాలు..అది మాకు ఎంతో సంతోషం అంటూ సినీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మహేష్ న్యూ లుక్స్ తో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. లాంగ్ హెయిర్, ఫుల్ గడ్డంతో తాజాగా కూడా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో సూపర్ స్టార్ తళుక్కుమన్నారు.

తాజా సమాచారం ప్రకారం..SSRMB29 ఈ నెల సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుండి యూనిట్ సభ్యులు అందరు వర్క్ షాప్ లో పాల్గొంటారని టాక్. డిసెంబరు నుండి పక్కాగా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ ను విదేశాల్లో మొదలెట్టనున్నారు. ఫారిన్ లోని అడవులలో భారీ చేజింగ్ సిక్వెన్స్ ను షూట్ చేయనున్నారు.

హై-వోల్టేజ్ యాక్షన్‌ అండ్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా కథ గురించి ఓ సాలిడ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ 18వ శతాబ్దపు బ్యాక్ డ్రాప్ తో పీరియాడిక్ డ్రామాగా మూవీ రూపొందనుందని సినీ ఇండస్ట్రీలో జోరు ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్లుగా నటీనటుల మేకోవర్స్ని వందల ఏళ్ల నాటి గిరిజన జాతికి చెందిన ఓ తెగ లుక్స్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట జక్కన్న. త్వరలో ఈ మేకోవర్కి సంబంధించిన పనులు పూర్తవ్వగానే..అక్టోబరు 10న రాజమౌళి బర్త్డే స్పెషల్ గా  ఒక ప్రెస్ మీట్ పెట్టి SSRMB29 నుండి అప్డేట్ ఇవ్వనున్నారని రానున్నట్లు టాక్. ఆపై అనువైన ప్రదేశాల్లో షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.  

భారీ అంచనాలతో వస్తోన్న ఈ మూవీని నిర్మాత కె.ఎల్‌. నారాయణ రూ.1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగానే హాలీవుడ్ టెక్నీషియన్స్ ను ఇందులో భాగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ నటించనుందని తెలుస్తోంది. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తుండగా..కీరవాణి మ్యూజిక్ సమకూరుస్తున్నారు.