డీఎస్పీపై కోపంతో రగిలిపోతున్న మహేశ్ ఫ్యాన్స్.. కారణం ఇదే..!

డీఎస్పీపై కోపంతో రగిలిపోతున్న మహేశ్ ఫ్యాన్స్.. కారణం ఇదే..!

ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులకు సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్పై చిర్రెత్తుకొచ్చింది. సోషల్ మీడియా వేదికగా డీఎస్పీపై కారాలుమిరియాలు నూరుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. శనివారం రాత్రి (అక్టోబర్ 19, 2024) గచ్చిబౌలి స్టేడియంలో డీఎస్పీ లైవ్ కాన్సర్ట్ జరిగింది. ఈ లైవ్ కాన్సర్ట్కు టాలీవుడ్కు చెందిన ప్రముఖ హీరోల అభిమానులంతా టికెట్లు కొనుక్కుని మరీ వెళ్లారు.

Not Even One Song of #Maheshbabu was Sung in Dsp Concert . Literally “Who are you” Song is a Pure Vibe and Concert song still 💔 Thanks for Disappointing Your Fans @ThisIsDSP .No Matter What’s going on inside “We fans are always proud of our Superstar Mahesh Babu” pic.twitter.com/8zA5KBMkgV

మహేశ్ బాబు అభిమానులు కూడా చాలా మందే వెళ్లారు. అయితే మెగా హీరోలతో పాటు ఇతర హీరోల సాంగ్స్ అన్నీ ఫెర్మార్మ్ చేసి అలరించిన డీఎస్పీ మహేశ్ బాబు పాటల్లో ఒక్కటంటే ఒక్క పాట కూడా ఫెర్మార్మ్ చేయకపోవడంతో పండుగాడి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. డబ్బులు పెట్టి మరీ టికెట్ కొనుక్కుని వెళ్లింది తమ అభిమాన హీరో సాంగ్స్ ఎంజాయ్ చేయడానికని, అలాంటిది ఒక్క సాంగ్ కూడా ఫెర్మార్మ్ చేయకపోవడం ఏంటని డీఎస్పీపై గరంగరం అవుతున్నారు.

Mahesh babu fans in yesterday's DSP concert ..#DSPLiveHyderabad pic.twitter.com/OQ8QLGjM4U

మహేశ్ బాబు, డీఎస్పీ కాంబోలో వచ్చిన ‘1 నేనొక్కడినే’ సినిమాలోని ‘‘Who Are You’’ సాంగ్ క్లైమ్యాక్స్ బీజీఎం ఈ ఈవెంట్లో ప్లే చేసినప్పటికీ టెక్నికల్ ప్రాబ్లం తలెత్తడంతో మధ్యలోనే కట్ చేశారు. దీంతో.. మహేశ్ బాబు ఫ్యాన్స్ ఈ ఈవెంట్ మధ్యలోనే వెళ్లిపోయారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని దేవీశ్రీప్రసాద్ను పొట్టుపొట్టు తిడుతున్నారు. కొందరైతే అభిమానం హద్దులు దాటి డీఎస్పీని బూతులు తిడుతున్నారు.

మహేశ్ బాబు, డీఎస్పీ కాంబోలో వచ్చిన సినిమాల్లో కాన్సర్ట్లో ఫెర్మార్మ్ చేసే సాంగ్స్ లేవనేది కొందరి వాదన. ఈ వాదనపై మహేశ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ‘1 నేనొక్కడినే’ సినిమాలోని ‘‘Who Are You’’ సాంగ్ భక్తి గీతమని ఇన్నాళ్లు తెలీదు అని మహేశ్ ఫ్యాన్స్ వెటకారం చేశారు. ‘నేనొక్కడినే’ సినిమాలో మహేశ్ బాబు రాక్ స్టార్ పాత్రలో నటించాడు. ఇలాంటి కాన్సర్ట్కు ‘‘Who Are You’’ సాంగ్ పర్ఫెక్ట్ ఛాయిస్.

The only Mahesh Babu song played at the concert

At one point crowd chanting ‘Who are you’ was louder than DSP's voice. https://t.co/pdCAWTBpc5 pic.twitter.com/FUmO0uuktw

మహేశ్ బాబు, దేవీశ్రీప్రసాద్ కాంబినేషన్లో ‘1: నేనొక్కడినే’, ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలొచ్చాయి. ఆల్మోస్ట్ ఈ సినిమాల్లోని సాంగ్స్ అన్నీ ప్రేక్షకాదరణ పొందినవే.

ALSO READ | తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న కన్నడ హీరో..