మహేశ్ గౌడ్​ సన్మాన సభను విజయవంతం చేయాలి

మహేశ్ గౌడ్​ సన్మాన సభను విజయవంతం చేయాలి
  • తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ

ముషీరాబాద్,వెలుగు: పీసీసీ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన బొమ్మ మహేశ్​ సన్మాన సభ ఓబీసీ ఎంపీల ఫోరం మాజీ కన్వీనర్ హనుమంతరావు ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో ఉంటుందని, ఈ సభను విజయవంతం చేయాలని తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. చిక్కడపల్లి లోని తమ ఆఫీస్​లో కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజు గౌడ్, రాష్ట్ర కన్వీనర్ ఆయిలి వెంకన్న గౌడ్, వర్కింగ్ చైర్మన్ ఎల్లికటే విజయ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. మహేష్ గౌడ్ కు టీపీసీసీ అధ్యక్ష పదవి దక్కడం గౌడ కులస్తులకు దక్కిన గౌరవం అన్నారు.