
నిర్మల్మాస్టర్ ప్లాన్ తో పాటు జీవో నెంబర్ 220ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను ఆగస్టు 21న తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు భగ్నం చేశారు. భారీ ఎత్తున అక్కడికి చేరుకున్న పోలీసులు ఆయన్ని దీక్ష విరమింపజేయడానికి ప్రయత్నించారు.
వైద్య పరీక్షల కోసం జిల్లా ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. హాస్పిటల్లోనూ దీక్ష కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలు ఆసుపత్రికి తరలి వెళ్లారు. దీక్షకు సంఘీభావం ప్రకటించారు. సీఎం కేసీఆర్, మాస్టర్ప్లాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇయ్యాల నిర్మల్కు కిషన్రెడ్డి
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సోమవారం నిర్మల్కు రానున్నారు. నిర్మల్మాస్టర్ ప్లాన్ కోసం తెచ్చిన జీవో 220ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి చేస్తున్న దీక్షకు ఆయన సంఘీభావం తెలపనున్నారు. శనివారం పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన కార్యకర్తలను కిషన్రెడ్డి పరామర్శించనున్నారు.