
హైదరాబాద్లో మహీంద్రా భారీ గోదాం
హైదరాబాద్, వెలుగు : మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్ (ఎంఎల్ఎల్) నెట్ జీరో వేర్హౌస్ను హైదరాబాద్లో మంగళవారం ప్రారంభించింది. సస్టెనబుల్ వేర్హౌసింగ్, ఆర్కిటెక్చర్, మల్టీ క్లయింగ్ కేపబిలిటీస్, క్లీన్ ఎనర్జీ వాడకం, వనరుల సంరక్షణ, భారీగా పచ్చదనం దీని ప్రత్యేకతలు. దీనిని సిద్ధిపేట జిల్లా ములుగు మండలం, బండమైలారం గ్రామంలోని అరుణ ఇండస్ట్రీయల్ పార్క్లో ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఎంఎల్ఎల్ మల్టీ యూజర్ సోలార్ పవర్డ్ ఫెసిలిటీలకు ఈ కేంద్రం అత్యంత ముఖ్యమైనదని కంపెనీ తెలిపింది. ఈ–కామర్స్ కస్టమర్లకూ సేవలనూ అందజేస్తుంది. ఇదిపూర్తిగా సోలార్, బ్యాటరీ స్టోర్డ్ శక్తితో పనిచేస్తుంది. మిగులు కరెంటును గ్రిడ్కు అందజేస్తుంది.
ఈ గోదాముతో 350 మందికి పైగా ఉపాధి దొరుకుతుందని మహీంద్రా లాజిస్టిక్స్ ఎండీ రామ్ ప్రవీణ్ స్వామినాథన్ అన్నారు. ‘‘దీనిని అసెట్లైట్ మోడల్లో 17 ఎకరాల్లో నిర్మించాం. దాదాపు రూ.40 కోట్ల వరకు ఖర్చయింది. మాకు దేశంలో 250 వేర్హౌస్లు ఉన్నాయి. ఏటా ఏడు కోట్ల డెలివరీలు ఇస్తున్నాం. ప్రస్తుతం 12,500 మంది ఉద్యోగులు ఉన్నారు. చాలా వేర్హౌస్లను క్లీన్ఎనర్జీతోనే నిర్వహిస్తున్నాం. తెలంగాణవ్యాప్తంగా మాకు 14 వేర్హౌస్లు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చిన్న నగరాల్లో విస్తరణకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాం”అని ఆయన వివరించారు.