స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి నష్టపోతున్నారా..? ఈ పరిస్థితి ఎందుకొచ్చిందంటే.. ఇదీ మేటర్..

స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి నష్టపోతున్నారా..? ఈ పరిస్థితి ఎందుకొచ్చిందంటే.. ఇదీ మేటర్..

‘అమెరికా తుమ్మితే.. ఇండియాకు సర్దయితది’.. మన స్టాక్​ మార్కెట్లలో తరచూ వినిపించే ఊత పదం ఇది. మన మార్కెట్లు వరుసగా కుప్పకూలడానికి అమెరికా అనుసరిస్తున్న విధానాలు ప్రధాన కారణం. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్​ గెలిస్తే  మన స్టాక్​ మార్కెట్లకు పండుగే అని నిరుడు చాలా మంది మిడిల్​క్లాస్​పబ్లిక్​పెట్టుబడులు పెట్టారు. నవంబర్​ మొదటి వారంలో ట్రంప్​ గెలిచారని తెలియగానే.. వరుసగా అమెరికా మార్కెట్లు పెరుగుతూ పోయాయి. రికార్డులు సృష్టించాయి. అదే రీతిలో మన మార్కెట్లు పెరుగుతాయనుకుంటే.. రివర్స్ ​అయ్యాయి.

అంతకు ముందు సెప్టెంబర్​ నుంచే ప్రారంభమైన మన మార్కెట్ల పతనం ట్రంప్​ గెలుపుతో మరింత పతనమయ్యాయి. గత నెల  20న అధ్యక్షుడిగా ట్రంప్​ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టారిఫ్​ వార్​ మొదలు పెట్టడంతో అప్పటి నుంచి బుధవారం కూడా దాదాపు ప్రతిరోజూ నెగెటివ్లోనే స్టాక్​ మార్కెట్​ఇండెక్స్లు క్లోజ్ అవుతున్నాయి.

మన మార్కెట్లను ఎక్కువగా నడిపేది ఫారెన్​ ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్స్(ఎఫ్​ఐఐ).. ఆ తర్వాత స్థానంలో డొమెస్టిక్స్​ ఇన్​స్టిట్యూషనల్​ఇన్వెస్టర్స్​(డీఐఐ) ఉంటారు. ఆగస్టు నుంచి వరుసగా ఎఫ్​ఐఐలు మన మార్కెట్లను విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. ప్రతి నెలా వేల కోట్లలో సేల్​ చేస్తున్నారు. 

నిరుడు అక్టోబర్లో అయితే లక్ష కోట్లకు పైగా సేల్ చేశారు. ఎఫ్ఐఐలు మన దగ్గరి నుంచి వెళ్లిపోవడంతోనూ స్టాక్​ మార్కెట్లు నేలచూపుచూస్తున్నాయి. ఒకప్పుడు ఏదైనా రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొందని వార్తలు వస్తే చాలు మన మార్కెట్లు పడిపోయేవి. ఇప్పుడు ఆ యుద్ధ వాతావరణం కన్నా.. అమెరికా టారిఫ్​ దెబ్బతోనే భారీగా పడిపోతున్నాయి.