
- మజ్లిస్ మైండ్ గేమ్!
- అజారుద్దీన్ ను ఓడించేందుకు ప్లాన్
హైదరాబాద్,వెలుగు : జూబ్లీహిల్స్అసెంబ్లీ సెగ్మెంట్ లో మజ్లిస్ మైండ్గేమ్ కు తెర తీసింది. తన మిత్రపక్షమైన బీఆర్ఎస్ను గెలిపించేందుకు ప్లాన్ చేస్తుంది. పార్టీ అభ్యర్థిని పోటీలో నిలబెడతామని ప్రకటించినా.. బీఆర్ఎస్గెలుపునే ప్రిస్టేజ్ గా తీసుకుని పావులు కదుపుతుంది. దీంతో సెగ్మెంట్ పై అన్నిపార్టీలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. మజ్లిస్, బీఆర్ఎస్ఎత్తులను కాంగ్రెస్ఎలా చిత్తు చేస్తుందనే దానిపైనే ఆసక్తి నెలకొంది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్రెండోసారి గెలుపు సవాల్గా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్కు ప్రజల్లో ఆదరణ పెరిగిన నేపథ్యంలో ఇక్కడి నుంచి పార్టీ అభ్యర్థిగా మాజీ క్రికెటర్అజారుద్దీన్ను బరిలోకి దిపింది. దీంతో విస్తుపోయిన బీఆర్ఎస్తన మిత్ర పక్ష పార్టీ మజ్లిస్క్యాండిడేట్ ను నిలబెట్టనుంది. దీనిపై ఇటీవల మీడియాతో మజ్లిస్అధినేత అసదుద్దీన్ఓవైసీ జూబ్లీహిల్స్ లో పోటీచేస్తామని స్పష్టం చేయడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది.
మైనార్టీల ఓటర్లే కీలకం
ఇక్కడ ఏ పార్టీ పోటీ చేసినా ముస్లిం మైనార్టీల ఓట్లు అధికంగా పడితేనే గెలుపు ఖాయం అవుతుంది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్, కాంగ్రెస్ నుంచి పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డి, బీజేపీ నుంచి రావుల శ్రీధర్రెడ్డి పోటీ చేశారు. 2014లో నవీన్యాదవ్మజ్లిస్ తరఫున పోటీ చేసి రెండోస్థానంలో నిలిచారు. 2018లో మజ్లిస్ పోటీ చేయలేదు. కానీ నవీన్యాదవ్ ఇండిపెండెంట్గా బరిలోకి దిగారు. ఆయనకు 18,817 ఓట్లు రావడం గమనార్హం. దీంతో మజ్లిస్ బరిలో లేక పోవడంతోనే బీఆర్ఎస్ గెలుపు ఈజీ అయిందనే వాదన అప్పట్లో వినిపించింది. ఈసారి పరిస్థితి మారిపోయింది. బీఆర్ఎస్ ను గెలిపించేందుకే మజ్లిస్ పోటీకి దిగినట్టు స్పష్టమవుతుంది.
కాంగ్రెస్కు చెక్ పెట్టేందుకే..
రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పుంజుకోవడం, బీఆర్ ఎస్ పై వ్యతిరేకత పెరుగుతుండడంతో మజ్లిస్ మద్దతుతో బీఆర్ఎస్ గెలవాలని నిర్ణయించింది. నియోజక పరిధిలో భాగమైన షేక్పేట, టోలీచౌకీ, బోరబండ తదితర ప్రాంతాల్లో ముస్లిం మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉంటాయి. ఏ పార్టీ అభ్యర్థి గెలుపులోనైనా వీరి ఓట్లే కీలకం. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి ఖరారయ్యారు. మజ్లిస్తన అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ సెలబ్రిటీ కావడం, నియోజకవర్గంలో ఉన్నతవర్గాలు వారు ఎక్కువగా నివసిస్తుండడంతో ఆయన వైపు ఓటర్లు ఇంట్రెస్ట్ చూపే చాన్స్ ఉంది. ఆయన గెలుపును అడ్డుకునేందుకే మజ్లిస్ అభ్యర్థిని రంగంలోకి దింపుతున్నట్టు సమాచారం. మజ్లిస్ పోటీలో ఉంటే ముస్లిం మైనార్టీల ఓట్లు భారీగా చీల్చొచ్చు. దీంతో మిగతా వర్గాల ఓట్లతో మరోసారి గెలువ వచ్చనేది బీఆర్ఎస్ వ్యూహంగా ఉంది. దీనికి మజ్లిస్ మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావడం గమనార్హం.
ALSO READ : లెటర్ టు ఎడిటర్ .. ప్రచార ఆర్భాటం!