హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. చిన్నారి మృతి

హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. చిన్నారి మృతి

హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కూల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వ నగర్ లో నాలుగు అంతస్థుల బిల్డింగ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బిల్డింగ్ గ్రౌండ్ ప్లోర్ లో ఉన్న సోఫా తయారీ గోదాంలో షార్ట్ సర్క్యూట్ ఒక్కసారిగా పొగలు వచ్చాయి. మంటలు ఫస్ట్ ఫ్లోర్ కు వ్యాపించి బిల్డింగ్ మొత్తం అంటుకున్నాయి. మంటల్లో దాదాపు 20 మంది చిక్కుకున్నట్టు సమాచారం.

స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఫైర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలోశ్రీనివాస్ కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన శ్రీనివాస్, భార్య నాగరాణి, హరిణి, శివప్రియ ఉన్నారు.  శ్రీనివాస్ పెద్ద కూతురు శివ ప్రియ మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.