
- రోజంతా కొనసాగిన రిపేర్లు
- పలు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
హైదరాబాద్సిటీ, వెలుగు: పటాన్చెరు సమీపంలోని మొఘల్ రెస్టారెంట్ వద్ద 1,500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్ లైన్కు ఆదివారం రాత్రి భారీ లీకేజీ ఏర్పడింది. దీంతో సోమవారం బోర్డు అధికారులు రిపేర్లు మొదలుపెట్టారు. ఎండీ అశోక్ రెడ్డి అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించి రిపేర్ల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈడీ మయాంక్ మిట్టల్ ఫీల్డ్కు వెళ్లి రిపేర్లను పర్యవేక్షించారు. సోమవారం రాత్రి వరకు పనులు చేసి లీకేజీని సరిచేశారు. అంతకుముందు వాటర్సప్లయ్నిలిచిపోయిన బీరంగూడ, అమీన్పూర్, మియాపూర్, చందానగర్ ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు.