కోలీవుడ్ స్టార్ అజిత్కు టాలీవుడ్లోనూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘విడాముయర్చి’. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజిత్ నటిస్తున్న 62వ చిత్రమిది. త్రిష, రెజీనా హీరోయిన్స్ కాగా, సంజయ్ దత్ విలన్గా, అర్జున్ కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని మేకర్స్ తెలియజేశారు. ఈ సందర్భంగా టీమ్ అంతా సెట్లో కలిసున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సినిమా అవుట్పుట్పై కాన్ఫిడెంట్గా ఉన్నామని మేకర్స్ చెప్పారు. ఇప్పటికే విడుదల చేసిన అజిత్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచగా, అజిత్ కెరీర్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ ‘మంగాత’ (తెలుగులో గ్యాంబ్లర్)లో నటించిన అజిత్, త్రిష, అర్జున్ కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.