3,900 మందికి మలబార్ ​స్కాలర్​షిప్స్​

3,900 మందికి మలబార్ ​స్కాలర్​షిప్స్​

హైదరాబాద్​, వెలుగు: ప్రస్తుత విద్యాసంవత్సరంలో తెలంగాణలోని 116 కాలేజీల్లో చదివే 3,900 మంది విద్యార్థినులకు స్కాలర్​షిప్స్ ఇస్తామని మలబార్ గోల్డ్​ అండ్ ​డైమండ్స్​ ప్రకటించింది.  ఇందుకోసం రూ.3.14 కోట్లు కేటాయిస్తారు. హైదరాబాద్​లోని ఐఏఎస్ ​ఆఫీసర్స్​ ఇన్​స్టిట్యూట్​లో శనివారం జరిగిన కార్యక్రమంలో కంపెనీ ఈ విషయాన్ని తెలియజేసింది. 

కార్పొరేట్​ సోషల్​ రెస్పాన్సిబిలిటీ (సీఎస్​ఆర్​)లో భాగంగా స్కాలర్​షిప్స్​ఇస్తున్నామని పేర్కొంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి అనసూయ సీతక్క ప్రారంభించారు.