అధికారులూ.. మీ కాళ్లకు దండం పెడతా : రాజశేఖర్ రెడ్డి

అధికారులూ.. మీ కాళ్లకు దండం పెడతా : రాజశేఖర్ రెడ్డి
  • అధికారులను వేడుకున్న మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి  

అల్వాల్, వెలుగు: అధికారులు ప్రజా సమస్యలను పట్టించుకోండి.. పరిష్కరించేందుకు కృషి చేయండి.  మీ కాళ్లకు దండం పెడతా’’.. అంటూ మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వేడుకున్నారు.  శుక్రవారం మచ్చ బొల్లారం డివిజన్ కౌకుర్ భరత్ నగర్ బస్టాప్ వద్ద స్థానికులు తమ సమస్యలపై సమస్యలపై ధర్నా చేయగా.. మద్దతుగా ఎమ్మెల్యే వెళ్లారు. అనంతరం భరత్ నగర్, రాజీవ్ గృహకల్ప, వాంబే కాలనీల్లో పర్యటించగా.. ఎమ్మెల్యేను స్థానికులు నిలదీశారు. గెలిచినప్పటి నుంచి తమ సమస్యలు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

త్వరగా పరిష్కరించకుంటే ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే వారినుద్దేశించి మాట్లాడుతూ అధికారుల దృష్టికి తీసుకెళ్లానని, కానీ..  నిధులు లేవని, తగిన సిబ్బంది లేరని చెబుతున్నారని చెప్పారు. నియోజకవర్గ సమస్యలపై జిల్లా ఇన్ చార్జ్  మంత్రి శ్రీధర్ బాబు, వీలైతే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్తానని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కోరారు