
- ఎంబీఏ స్టూడెంట్కు లెక్చరర్ గలీజ్ మెసేజ్లు
- మల్లారెడ్డి కాలేజీ లెక్చరర్పై కేసు
జీడిమెట్ల, వెలుగు : ఎంబీఏ స్టూడెంట్కు గలీజ్గా మెసేజ్లు పంపుతూ లైంగిక వేధిస్తున్న మల్లారెడ్డి కాలేజీ లెక్చరర్పై పేట్బషీరాబాద్ పీఎస్లో కేసు నమోదైంది. ఈ నెల 20న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన యువతి (21) మైసమ్మ గూడలోని మల్లారెడ్డి కాలేజీలో ఎంబీఏ చేస్తూ హాస్టల్లో ఉంటోంది. కాలేజీకి చెందిన లెక్చరర్ టి.స్వామి ఆమెకు అసభ్యకరంగా మెసేజ్లు పంపుతూ లైంగికంగా వేధిస్తున్నాడు.
దీంతో ఆ విద్యార్థిని కాలేజీ మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేసినప్పటికీ సరిగా స్పందించలేదు. తాము ఎంక్వైరీ కమిటీ వేశామని, లెక్చరర్స్వామిని డిస్మిస్చేశామని చెప్పుకొచ్చారు తప్పితే డిస్మిస్చేసిన పేపర్లు మాత్రం బయటకు చూపలేదు. అలాగే స్వామి ఫోన్ స్విచ్చాఫ్ ఉందని, ఇంటివద్ద లేడన్నారు. దీంతో కాలేజ్మేనేజ్ మెంట్సైతం స్వామికి సపోర్ట్చేస్తుందని, ఆయనపై చర్యలు తీసుకోవాలి పేట్బషీరాబాద్ పోలీసులకు బాధిత యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.