ఆ హీరోకి ఇండస్ట్రీలో జరగేదంతా తెలుసంటూ స్టార్ హీరో తల్లి సంచలనం..

ఆ హీరోకి ఇండస్ట్రీలో జరగేదంతా తెలుసంటూ స్టార్ హీరో తల్లి సంచలనం..

మలయాళ ప్రముఖ నటి మల్లికా సుకుమారన్ సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందిస్తూ మండిపడ్డారు. ఈ క్రమంలో మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ) పనితీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్థిక అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి కేటాయించిన నిధుల పంపిణీలో కొందరు పక్షపాతం చూపిస్తూ తమకి ఇష్టం వచ్చినవారికి పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ క్రమంలో పేద కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చిన వారికి కాకుండా, నెలకొకసారి దుబాయ్ దేశానికెళుతూ తమ అవసరాలు తీరుస్తున్న వారికి సహాయం చేస్తున్నారని, అలాగే అమ్మ కమిటీలోని కొందరు తమ కోరికలు తీర్చునుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమా ఇండస్ట్రీలో జరిగే తప్పుల గురించి ప్రముఖ స్టార్ హీరో మోహన్ లాల్ కి కూడా తెలుసని కానీ ఆయన ఎందుకు సైలెంట్ ఉన్నాడో అర్థం కావడం లేదని అన్నారు. 

ALSO READ | 4వ పెళ్లి చేసుకున్న స్టార్ హీరో.. ఆస్తి కోసమే అంటూ కామెంట్లు..

అయితే సినిమా ఇండస్ట్రీలో లింగభేదం లేకుండా అందరికీ సమన హక్కులు ఉండాలని ఏర్పాటు చేసిన హేమ కమిటీ ని అమ్మ అసోసియేషన్ పట్టించుకోలేదని అందువల్లే నేడు మహిళా నటులు చాల ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని చెప్పుకొచ్చింది. గతంలో అమ్మ అసోసియేషన్ లో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపినందుకే తన భర్త దివంగత నటుడు సుకుమారన్ ని కొంతకాలంపాటూ నిషేధించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఈ విషయం ఇలా ఉండగా నటి మల్లికా సుకుమారన్ సినిమాలకి గుడ్ బై చెప్పిన తర్వాత రెస్టారెంట్ బిజినెస్ రంగంలో స్థిరపడ్డారు. ఈ క్రమంలో దుబాయ్ దేశంలో దాదాపుగా 4 రెస్టారెంట్లు నడుపుతున్నారు. ఇక మల్లికా సుకుమారన్ తనయుడు పృథ్వీరాజ్ సుకుమారన్ టాప్ హీరోలలో ఒకరుగా రాణిస్తున్నాడు. కాగా తెలుగులో ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరియు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ సినిమాలో రెండో హీరోగా నటించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.