రాజ్యసభలో మోదీపై ఖర్గే ఎటాక్...సామెతలు,సెటైర్లతో విమర్శలు

రాజ్యసభలో మోదీపై ఖర్గే ఎటాక్...సామెతలు,సెటైర్లతో విమర్శలు

రాజ్యసభలో ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే.  సామెతలు,సెటైర్లతో ప్రధానిపై కౌంటర్ అటాక్ చేశారు.  రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదం తీర్మాన చర్చ సందర్భంగా ఖర్గే మాట్లాడారు. ప్రధాని స్థాయి అయి ఉండి  విద్వేష ప్రసంగం  చేయడం కరెక్ట్ కాదని సూచించారు.  

మోదీ ఎన్నిక లప్రచారంలో అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు. నోటికొచ్చినట్లు అబద్ధాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. కుల,మత , భాషా పరంగా విద్వేషాలు రెచ్చగొట్టారన్నారు.  ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు మోదీ 200లకు పైగా స్పీచ్ లు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మోదీ117 కు పైగా స్పీచ్ లపై ఈసీకి కంప్లైంట్ చేశాం.. ఈసీకి కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు ఖర్గే. 

ఎన్నికల ముందు విపక్షాల అకౌంట్లు ఫ్రీజ్ చేసి.. ఎన్నికల ప్రచారాన్ని ఎన్నో రకాలుగా  అడ్డుకోవాలని చూశారని విమర్శించారు ఖర్గే.  విపక్షాలను అణగదొక్కడం మోదీకి అలవాటుగా మారిందన్నారు. చందా దేవో..దందా ఖరో మోదీ నినాదంగా మారిందని ఎద్దేవా చేశారు. ఈడీ, సీబీఐ, ఐటీలను ఇష్టం వచ్చినట్లు వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read:లోక్సభ నుంచి విపక్షాల వాకౌట్

ప్రభుత్వాలను  పడొట్టడం, నేతలను కొనుగోలు  చేయడం కామన్ అయిపోయిందన్నారు. మహారాష్ట్ర, గోవా,మణిపూర్ లో ప్రభుత్వాలను పడగొట్టలేదా? అని ప్రశ్నించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జార్ఘండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ లను అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. కేజ్రీవాల్ కు ఒక కేసులో బెయిల్ వస్తే..మరో కేసులో అరెస్ట్ చేశారని అన్నారు. 

పొత్తులను అపహస్యం చేసిన మోదీ..ఇపుడు పొత్తులపైనే ఆధారపడ్డారని అన్నారు. మోదీ సినిమాలో అన్ని లీకేజీలేనని  సెటైర్ వేశారు. నీట్ పేపర్ లీక్,  నీట్ నీట్ పీజీ రద్దు, అయోధ్య రామాలయంలో లీక్ ..ఏటా 20లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మూడేళ్ల కాలంలో 70 సార్లు పేపర్ లీక్ జరిగిందని మండిపడ్డారు ఖర్గే.

 అయితే ఖర్గే వ్యాఖ్యలను కేంద్రమంత్రి నడ్డా తప్పుబట్టారు. ప్రధాని మోదీపై, కేంద్రంపై ఖర్గే ఇష్టానుసారంగా విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు నడ్డా.