నీతి ఆయోగ్ సమావేశం నుంచి మధ్యలోనే మమతా బెనర్జీ వాకౌట్

నీతి ఆయోగ్ సమావేశం నుంచి మధ్యలోనే మమతా బెనర్జీ వాకౌట్

ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం నీతి ఆయోగ్ భేటీ కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు, కేంద్రమంత్రులు హాజరయ్యారు. ఇక తనకు మాట్లాడేందుకు సరిపడా టైం ఇవ్వలేదంటూ నీతి ఆయోగ్ భేటీ నుంచి వాకౌట్ చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మాట్లాడేందుకు సరిపడా టైం ఇవ్వకుండా అవమానించారన్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.

తన కంటే ముందు మాట్లాడిన వారికి 20నిమిషాల వరకు టైం ఇచ్చారన్నారు. కానీ తనకు కేవలం 5నిమిషాలు మాత్రమే కేటాయించారన్నారు. దీంతో తాను నీతి ఆయోగ్ మీటింగ్ నుంచి బయటకు వచ్చానన్నారు మమతాబెనర్జీ. దేశంలోని రాష్ట్రాలపై వివక్షను చూపించొద్దని..కేంద్రానికి చెప్పానన్నారు మమతాబెనర్జీ.

ఇక కేంద్రబడ్జెట్ లో తమ రాష్ట్రాలపై పక్షపాతం చూపించారని ఆరోపిస్తూ నీతి ఆయోగ్ మీటింగ్ కు కర్ణాటక సీఎం సిద్దారామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ అటెండ్ కావడం లేదు. ఇక తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్ తోపాటు ఆప్ నేతృత్వంలోని పంజాబ్ ఢిల్లీ ప్రభుత్వాలు సైతం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాయి.