మహిళ  గర్భాశయంలో .. ఐదు కిలోల కణితి తొలగింపు

మహిళ  గర్భాశయంలో .. ఐదు కిలోల కణితి తొలగింపు

జీడిమెట్ల, వెలుగు:  హైదరాబాద్ నిజాంపేటలోని మమత హాస్పిటల్ నిర్వాహకులు ఓ మహిళలకు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రి యాజమాన్యం గురువారం వెల్లడించింది.  సిటీకి చెందిన ఎల్లమ్మ  (50) అనే మహిళకు గర్భాశయంలో  కణితి (ఓవేరియన్​సిస్ట్​) ఏర్పడింది. 

దీంతో ఆమె పలు ఆసుపత్రులను  వైద్యం కోసం సంప్రదించింది. ఆమెకు గుండె జబ్బు ఉండడంతో చికిత్స చేయడానికి పలు డాక్టర్లు వెనుకంజవేశారు.  దీంతో ఎల్లమ్మ నిజాంపేటలోని మమత ఆసుపత్రిలో చేరింది.  డాక్టర్ ​మైత్రి ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం సుమారు 5 కిలోల కణితిని తొలగించారు. సమావేశంలో డాక్టర్​ నవీశ్వర్​, ధీరజ్ పాల్గొన్నారు.