వ్యాపారంలో సహకరిస్తానని మోసం.. రూ.2.82 లక్షలతో జెండా ఎత్తేసిన వ్యక్తి అరెస్ట్

వ్యాపారంలో సహకరిస్తానని మోసం.. రూ.2.82 లక్షలతో జెండా ఎత్తేసిన వ్యక్తి అరెస్ట్

జూబ్లీహిల్స్, వెలుగు: హోటల్​వ్యాపారంలో సహకరిస్తానని సాఫ్ట్ వేర్ ఇంజినీర్​ను మోసగించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కూకట్ పల్లి అల్వీన్​కాలనీకి చెందిన ఆరేటి జ్ఞానసాయి ప్రసాద్​(29) ఐటీ ఉద్యోగి. ఏదైనా వ్యాపారం చేయాలని సన్నిహితులతో మాట్లాడేవాడు. ఈ క్రమంలో ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న అనంతపురం జిల్లా గుంతకల్​కు చెందిన గోవర్ధన్​(35) అతనికి పరిచయమయ్యాడు.

గోవర్ధన్ గతంలో ఫైర్​ సర్వీస్​లో హోంగార్డుగా పనిచేశాడు. ప్రస్తుతం అమూల్​మిల్క్​డిస్ట్రిబ్యూటర్​గా పనిచేస్తూ టాస్క్​ఫోర్స్​లో కానిస్టేబుల్​గా పనిచేస్తున్నానని ప్రసాద్​ను నమ్మించాడు. తనకు పెద్దవాళ్లతో పరిచయాలు ఉన్నాయని, వారి ద్వారా హోటల్​కు కావ్సాలిన ఫర్నిచర్,​ ఇతర ఐటమ్స్ ఇప్పిస్తానని చెప్పాడు. ఇందుకోసం పలు దఫాలుగా రూ.2,82,725 తీసుకున్నాడు.

ఆ తర్వాత గోవర్ధన్​ఫోన్​ స్విచ్చాఫ్​రావడం, పత్తా లేకుండా పోవడంతో బాధితుడు బంజారాహిల్స్​ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్​చేసి, రిమాండ్​కు తరలించారు.