చందానగర్​ లో వ్యక్తి దారుణ హత్య

చందానగర్​ లో వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్  చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో నసీర్​ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు  హత్య చేశారు.   గోపినగర్ లో నివసిస్తున్న నసీర్​ ను అతని స్నేహితులు  నిన్న రాత్రి ( ఫిబ్రవరి 21)  నీతో మాట్లాడాలని తీసుకెళ్లారు. తరువాత అర్దరాత్రి 12 గంటల సమయంలో కొండాపూర్​ ఏరియా ఆస్పత్రికి నసీర్​ ను అతని స్నేహితులు తీసుకొచ్చారు.  అయితే అప్పటికే నసీర్​​ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 

సమాచారం అందుకున్న పోలీసులు మృత దేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసిన పోలీసులు .. మృతుడి స్నేహితులను  అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.