Viral Video:బిడ్డను కరిచిందని..కుక్కను కిరాతకంగా చంపాడు

Viral Video:బిడ్డను కరిచిందని..కుక్కను కిరాతకంగా చంపాడు

ఇంత దారుణమా..ఇంత కిరాతకమా..ఆడ కుక్కను కర్రతో దారుణంగా కొట్టాడు..దెబ్బలకు తాళలేక గిల గిల కొట్టుకుంటున్న ఆ కుక్కను తాడుతో బైక్​ వెనక కట్టుకొని రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లాడు..అంతటితో అతని కసి తీరలేదు..మరోసారి కర్రతో దారుణంగా కొట్టి కొట్టి హింసించాడు..చివరికి తలపై పెద్ద బండరాయితో బాది అత్యంత కిరాతకంగా చంపేశాడు. 

రెండ్రోజుల క్రితం మధ్యప్రదేశ్​ లోని గుణనగర్​ లో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి.. కుక్కను దారుణంగా హింసించి చంపిన సీసీటీవి ఫుటేజీ వైరల్​ కావడంతో వెలుగులోకి వచ్చింది.ఆ దృశ్యాలు చూసిన వారికి ఎవరికైనా ఒళ్లు గగుర్లుపొడవక మానదు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడికి ఇదేం పోయే కాలం రా నాయనా.. అని బూతులు తిట్టుకుంటున్నారు. జంతు ప్రేమికులు , జంతు సంక్షేమ సంస్థలు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ALSO READ | కారులో వెళుతున్న ఐటీ జంట: వెంటాడి మరీ వేధించిన 40 మంది పోకిరీలు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిందితుడిని మధ్యప్రదేశ్​ లోని గుణ నగర్​ పరిధిలోని నయాపురా ప్రాంతానికి చెందిన పప్పుగా గుర్తించారు. పప్పును పట్టుకొని జంతువుల హింస నిరోధక చట్టం లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం కూతురిని కరిచిందని ప్రతీకారం తీర్చుకునేందుకు నయాపురా ప్రాంతంలో కుక్కను అతి కిరాతకంగా చంపినట్లు పోలీసులు తెలిపారు. 

ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు పప్పును కఠినంగా శిక్షించాలని జంతు ప్రేమికులు, జంతు సంక్షేమ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.