
జీడిమెట్ల, వెలుగు: ఇండియన్ఎయిర్ఫోర్సులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ యువకుడు 50 మంది నిరుద్యోగుల నుంచి రూ.3 కోట్లు కొట్టేశాడు. ఈ ఘటన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా, పిట్టంకి చెందిన కేతావత్సంతోశ్కొంపల్లికి జయబేరీ పార్కులో ఉంటున్నాడు. ఎయిర్ఫోర్సులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని నమ్మించాడు.
ఫేక్హాల్టికెట్స్, ఫేక్ఎగ్జామ్స్ నిర్వహించి ఫేక్అపాయింట్మెంట్లెటర్స్ ఇచ్చాడు. అంతా నిజమేనని నమ్మిన కొందరి నుంచి రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేశాడు. చివరికి అవి ఫేక్అపాయింట్మెంట్లెటర్స్అని తెలిసి, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గడిచిన రెండేళ్లలో సంతోశ్50 మందిని మోసం చేసి దాదాపు రూ.3 కోట్లు కొట్టేసినట్లు తెలిసింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. శనివారం 8 మంది బాధితులు పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది.