
నెక్కొండ, వెలుగు: కోతులను కొట్టబోయి ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. నెక్కొండ మండలం మడిపల్లికి చెందిన రైతు తేజావత్వెంకన్న(35) ఇంటి ఆవరణలోని మంగళవారం ఉదయం కోతుల గుంపు వచ్చింది.
అతడు వాటిని కొట్టబోయే క్రమంలో పక్కనే ఉన్న బావిలో జారిపడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయాలై స్పాట్ లో చనిపోయాడు. మృతుడి భార్య సునీత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ మహేందర్ తెలిపారు.