ఓనం పండగ పూట.. నోట్లో ఇడ్లీలు ఇరుక్కొని చనిపోయాడు

ఓనం పండగ పూట.. నోట్లో ఇడ్లీలు ఇరుక్కొని చనిపోయాడు

కేరళలో ఓనం పండుగ సెలబ్రేషన్స్ చేసుకుంటుండగా ఓ వింత ఘటన సంచలనంగా మారింది. కంజికోడ్ గ్రామంలో కొందరు యువకులు ఇడ్లీ తినే పోటీలు పెట్టుకున్నారు. 50ఏళ్ల వ్యక్తి ఇడ్లీలు తినే పోటీలో పాల్గొని.. చనిపోయాడు. పండగపూట మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కంజికోడ్ గ్రామానికి చెందిన యువకులు ఇడ్లీ తినే పోటీ నిర్వహించారు. 

ఎక్కువ ఇడ్లీలు తిన్న వ్యక్తి బహుమతి గెలుచుకుంటాడు. ఆలంరం పాలక్కాడ్‌కు చెందిన సురేష్‌(50 ) కూడా ఈ పోటీల్లో పాల్గొన్నాడు. ఈసారి ఏకంగా 3 ఇడ్లీలు తినేందుకు సురేష్ ప్రయత్నించాడు. ఇడ్లీలు అతని గొంతులో ఇరుక్కొని నొప్పి మొదలైంది. ఆ తర్వాత వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

సురేష్ పరిస్థితి విషమించడంతో వాలర్ లోని మరో హాస్పిటల్ లో చేర్పించారు. చికిత్స పొందుతూ అక్కడ అతను మరణించాడు. పోలీసులు ఆ ఘటనపై అన్ న్యాచురల్ డెత్ గా కేసు నమోదు చేశారు. ఈ విచార ఘటన పోటీ నిర్వహకులు, సురేష్ కుటుంబ సభ్యుల్లో బాధని నింపింది.