షిర్డీకి వెళ్లే దారి లాడ్జిలో మద్యం, మ్యాంగో జ్యూస్ తాగారు.. ఇంతలోనే..

షిర్డీకి వెళ్లే దారి లాడ్జిలో మద్యం, మ్యాంగో జ్యూస్ తాగారు.. ఇంతలోనే..

అనుకున్నది ఒకటైతే..జరిగింది ఇంకోటి..షిరిడీ వెళదామనుకున్నారు..అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. రైల్వే టికెట్లు బుక్ చేశారు. ఎక్కాల్సిన ట్రైన్ మిస్ అవడం.. యాదృచ్ఛికంగా  ఓ లాడ్జిలో ఆ రాత్రి ఉండటం.. తెల్లారేసరికి ఏ జరిగిందో తెలియదు..నిద్రలో ఉన్నవాడు నిద్రలోనే చనిపోయాడు. ముంబైలోని థానే లో ఓ లాడ్జిలో 35 యేళ్ల వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయిన ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..  

చౌరాసియా అతని స్నేహితుడు సురేష్ టింగోటే ఇద్దరు జూలై 24, 2024  సాయంత్రం షిరిడీకి వెళ్లేందుకు థానే రైల్వే స్టేషన్ కు వెళ్లారు. ట్రైన్ మిస్ కావడంతో సమీపంలోని ఓ లాడ్జిలో వేర్వేరుగా రెండు గదులు బుక్ చేసుకున్నారు. రాత్రి సమయంలో ఇద్దరు మద్యం, మ్యాంగో డ్రింక్ తాగి వారివారి గదుల్లోకి వెళ్లారు. మరుసటి రోజు దుయం 7 గంటలకు టింగోటే చౌరాసియాకు ఫోన్ చేశాడు.  ఎలాంటి స్పందన లేకపోవడంతో లాడ్జి సిబ్బంది సాయంతో స్నేహితుడు గది తెరిచాడు.  ఏం జరిగిందో ఏమోగానీ చౌరాసియా అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలిస్తే అప్పటికే చనిపోయాడని వైద్యులు చెప్పారు. ఈఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మ్యాంగో జ్యూస్ తాగితేనే చనిపోయాడా.. ఇంకేదైనా కారణాలేవైన ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపట్టారు.