
హైదరాబాద్ సిటీ, వెలుగు: వాటర్బోర్డు సప్లయ్చేస్తున్న నీటితో బైక్వాష్చేస్తున్న యువకుడికి రూ.1000 ఫైన్పడింది. వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి బుధవారం పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ వైపు వెళ్తుండగా రోడ్ నం.78లో వాటర్పైపల్లైన్లీక్అయినట్లు గమనించారు.
కారణాలు ఆరా తీయమని ఆదేశించడంతో స్థానిక అధికారులు పరిశీలనకు వెళ్లారు. తీరా ఓ వ్యక్తి ఇంటి ముందు నల్లా నీటితో బైక్ కడుగుతూ కనిపించాడు. ఆ నీరంతా రోడ్డుపై పారుతోంది. ఎండీ అశోక్రెడ్డి ఆదేశాలతో అధికారులు అతనికి నోటీసులు జారీచేశారు. రూ.1000 జరిమానా విధించారు.