హత్యా..? ఆత్మహత్యా?..ఒకే ఇంట్లో తండ్రీ, నలుగురు కూతుళ్లు మృతి

హత్యా..? ఆత్మహత్యా?..ఒకే ఇంట్లో తండ్రీ, నలుగురు కూతుళ్లు మృతి
  •  
  • తండ్రీ, నలుగురు కూతుళ్లు అనుమానాస్పద మృతి
  • ఢిల్లీలోని ఓ ఇంట్లో ఘోరం
  • ఆత్మహత్యేనని పోలీసుల అంచనా

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి, అతని నలుగురు కూతుళ్లు తమ ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. ఆ కుటుంబం మొత్తం నాలుగు రోజుల క్రితమే చనిపోగా.. శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసిన పోలీసులు వారిది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రంగ్​పురిలోని ఓ ఇంట్లో హీరాలాల్ శర్మ, అతని కుమార్తెలు నీతు, నిక్కీ, నీరూ, నిధి కిరాయికి ఉంటున్నారు. 

వీరుంటున్న ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇంటి ఓనర్ డోర్ కొట్టాడు. ఎటువంటి స్పందన లేకపోవడంతో పోలీసులకు కాల్ చేశాడు. వారు వచ్చి డోర్లు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా హీరాలాల్, అతని కూతుళ్లు విగతజీవులుగా పడి ఉన్నారు. మూడు ఓపెన్​ చేసిన ప్యాకెట్లు, అనుమానాస్పద ద్రవంతో ఉన్న గ్లాసులను పోలీసులు గుర్తించారు.