టెక్ జమానాలో కూడా ఇదేంటీ..?మంత్రాలు చేస్తున్నాడన్న అనుమానంతో వ్యక్తి హత్య

టెక్ జమానాలో కూడా ఇదేంటీ..?మంత్రాలు చేస్తున్నాడన్న అనుమానంతో వ్యక్తి హత్య

నెల్లికుదురు (ఇనుగుర్తి), వెలుగు: మంత్రాలు చేస్తున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తి మరో వ్యక్తిని హత్య చేశారు. ఈ ఘటన మహబూబాబాద్‌‌‌‌ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్నముప్పారంలో శుక్రవారం సెప్టెంబర్27,2024న జరిగింది. గ్రామానికి చెందిన మల్లం యాకయ్య (60)కు మంత్రాలు వస్తాయని, తనపై కూడా మంత్రాలు చేశాడని అదే గ్రామానికి చెందిన మల్లం రాజు అనుమానం పెంచుకున్నాడు. దీంతో యాకయ్యను హత్య చేసేందుకు నిర్ణయించుకున్నాడు. 

శుక్రవారం తెల్లవారుజామున రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యాకయ్య తలపై కర్రతో బలంగా కొట్టడంతో యాకయ్య అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు రాజును పట్టుకొని తాళ్లతో కట్టేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి కుమారుడు రమేశ్‌‌‌‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, రాజును అరెస్ట్‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌కు తరలించినట్లు తొర్రూర్‌‌‌‌ సీఐ జగదీశ్‌‌‌‌, నెల్లికుదురు ఎస్సై రమేశ్‌‌‌‌ బాబు తెలిపారు.