కల్తీ సాస్ లు.. గడువు తీరిన బేకరీ ప్రొడక్ట్స్.. నకిలీ ఐటమ్స్ అమ్ముతున్న షాపు నిర్వాహకుడు అరెస్ట్

కల్తీ సాస్ లు..  గడువు తీరిన బేకరీ ప్రొడక్ట్స్.. నకిలీ ఐటమ్స్ అమ్ముతున్న షాపు నిర్వాహకుడు అరెస్ట్
  • వరంగల్​ మండి బజార్​లోని షాపులో టాస్క్ ఫోర్స్​తనిఖీలు
  • రూ.8 లక్షల విలువైన 196 రకాల వస్తువులు స్వాధీనం

హనుమకొండ, వెలుగు: వరంగల్ సిటీలో కల్తీ ఫుడ్స్ అమ్ముతున్న బేకరీ షాపుపై టాస్క్​ఫోర్స్​పోలీసులు కొరడా ఝుళిపించారు. కొన్ని బ్రాండ్లకు చెందిన నకిలీ పదార్థాలతో పాటు గడువు ముగిసిన,  కల్తీ చేసిన రూ.8 లక్షల విలువైన196 రకాల బేకరీ ఐటమ్స్​ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. టాస్క్​ఫోర్స్​పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ సిటీలోని బేకరీల్లో ఫుడ్ తయారీకి నకిలీ, కల్తీ ఐటమ్స్ వాడుతున్నారని ఫిర్యాదులు అందాయి.

గురువారం సాయంత్రం టాస్క్​ఫోర్స్, ఫుడ్​సేఫ్టీ ఆఫీసర్లు, ఇంతేజార్​గంజ్​ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. మండిబజార్​ఏరియాలోని సంతోష్​కుమార్​కిరాణ జనరల్​ స్టోర్స్​లో బేకరీ ఐటమ్స్ తయారీకి వాడే పైనాపిల్, యాపిల్, మ్యాంగో, వంటి ఫ్రూట్ క్రష్​లు, పఫ్​లపై వాడే చిల్లీ, టమోటా సాస్​లు, స్పైసీ పౌడర్లు, ఫ్లేవర్లు గడువు పూర్తయిన, క్వాలిటీ లేని ప్రొడక్ట్స్​గా గుర్తించారు. చాక్లెట్​స్టిక్స్, ఇతర క్రీమ్స్​క్వాలిటీగా లేవని నిర్ధారించారు.

వాటిని ఇతర జిల్లాలకు సప్లై చేసేందుకు సిద్ధంగా ఉంచినట్లు తెలుసుకుని సీజ్​చేశారు. షాప్​ఓనర్​అంచూరి సంతోష్​ కుమార్ ను అదుపులోకి తీసుకుని ఇంతేజార్​గంజ్ పోలీసులకు అప్పగించారు. ఫుడ్​సేఫ్టీ రూల్స్ ఉల్లంఘించే వ్యాపారులపై తగిన చర్యలు తీసుకుంటామని వరంగల్ సీపీ అంబర్​కిశోర్​ఝా హెచ్చరించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలను అమ్మితే ఫుడ్​సేఫ్టీ – 2006, 2011 కింద యాక్షన్​ తీసుకుంటామని స్పష్టంచేశారు. టాస్క్​ఫోర్స్​ ఏసీపీ మధుసూదన్​, సీఐలు రవి కుమార్​, రంజిత్​కుమార్, ఎస్ఐ శరత్, ఇంతేజార్​గంజ్​ఎస్ఐ వెంకన్న, ఫుడ్​సేఫ్టీ ఆఫీసర్​కృష్ణమూర్తి, సిబ్బందిని సీపీ అభినందించారు.