సగం కట్టి.. వదిలేశారు.. అసంపూర్తిగా మనపూరు-మనబడి పనులు

సగం కట్టి.. వదిలేశారు.. అసంపూర్తిగా మనపూరు-మనబడి పనులు
  • అసంపూర్తిగా మనపూరు-మనబడి పనులు 
  • క్లాస్​రూమ్స్ లేక అవస్థలు పడుతున్న స్టూడెంట్లు  
  • ఫండ్స్​ రాక చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు

కామారెడ్డి, వెలుగు:  గత ప్రభుత్వం చేపట్టిన మన ఊరు– మనబడి పనులు మధ్యలోనే ఆగిపోయాయి.    చాలా స్కూళ్లలో అడిషనల్ క్లాస్​ రూంల నిర్మాణం ప్రారంభించగా ఫండ్స్​ కొరతవల్ల    అసంపూర్తిగా  మిగిలాయి.  పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో  సరిపడినన్ని  క్లాస్​రూమ్స్​లేక అనేక చోట్ల స్టూడెంట్స్​ ఇబ్బంది పడుతున్నారు.  కొన్ని చోట్ల శిథిలమైన బిల్డింగ్​ల్లోనే చదువులు సాగుతున్నాయి.  సమ్మర్​ హాలిడేస్​లోనైనా  వర్క్స్​ కంప్లీట్​ చేస్తే  వచ్చే ఏడాదైనా తరగతిగదుల కొరత తీరుతుందని స్టూడెంట్స్​అంటున్నారు.

జిల్లాలో 1,013 గవర్నమెంట్​ స్కూల్స్​ ఉన్నాయి.   ఇందులో  352 స్కూళ్లను  మన ఊరు- మన బడి కింద సెలక్ట్​ చేశారు. శిథిలమైన చోట  కొత్త బిల్డింగులు,   అవసరమైన చోట అడిషనల్​ క్లాస్​ రూమ్స్, కిచెన్​షెడ్లు, కంపౌండ్​వాల్స్​, టాయిలెట్స్​ నిర్మించాలని  నిర్ణయం తీసుకుని..    రూ. 175 కోట్లతో పనులు ప్రారంభించారు.  పనులు చేపట్టి 3 ఏండ్లయినా   ఇంత వరకు కంప్లీట్​ కాలేదు.  మెత్తం 352 చోట్ల వర్క్స్​మొదలు పెట్టగా  62 వర్క్స్​ కంప్లీట్​  కాగా,  183 వర్క్స్​ మధ్యలో అగిపోయాయి.  42 చోట్ల పనులు ప్రారంభమే కాలేదు. 

 పనులు చేసిన వారికి  కేవలం రూ. 27 కోట్ల మేర బిల్లులు చెల్లించారు. పనులు మొదలు పెట్టి నెలలు గడిచినా బిల్లుల సరిగా చెల్లించకపోవడంతో  కాంట్రాక్టర్లు నిర్మాణాలను మధ్యలోనే అపేశారు. కామారెడ్డిటౌన్​, కామారెడ్డి మండలంలోని పలు గ్రామాలు,  నస్రుల్లాబాద్​ మండలంలోని మిర్జాపూర్​,  దుర్కి, లింగంపల్లి తండా,  బాన్సువాడ మండలం మొగిలానిపల్లి , సంగమేశ్వర్​కాలనీ,  బాన్స్​వాడ టౌన్​,   పిట్లం మండలం అన్నారం, తాడ్వాయి, రాజంపేట,  గాంధారి,  భిక్కనూరు తదితర చోట్ల  పనులు అసంపూర్తిగా ఉన్నాయి.  

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని  దళితవాడలోని హైస్కూల్​లో క్లాస్ రూమ్​ నిర్మాణానికి మూడేండ్ల కింద   పనులు చేపట్టినా ఇప్పటికీ  బేస్మెంట్​  దశ దాటలేదు.  పాత క్లాస్​ రూమ్స్​ సరిపోవటం లేదు. కొన్ని రూమ్స్శిథిలమయ్యాయి.  కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గర్ల్స్​ హైస్కూల్​ బిల్డింగ్​ శిథిలమైంది.   మన ఊరు- మన బడి కింద ఇక్కడ క్లాస్​ రూమ్స్​ నిర్మాణం పనులు షూరు చేశారు.  స్లాబ్​ల వరకు పనులు కంప్లీట్​ అయ్యాయి.    ఫ్లోరింగ్​తదితర పనులు జరగలేదు.  బిల్స్​ రాకపోవడంతో  కాంట్రాక్టర్​ వర్క్స్​ అపేశారు. ప్రస్తుతం  ఉన్న క్లాస్​ రూమ్స్​  పై కప్పులు పెచ్చులూడుతున్నాయి.  క్లాస్​ రూమ్స్​ సరిపోక అసంపూర్తిగా అగిపోయిన బిల్డింగ్​లోనే  క్లాస్​లు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.