
- కాకా వెంకటస్వామి స్మారక క్రికెట్పోటీలు ప్రారంభం
కోల్బెల్ట్, వెలుగు: కాకా వెంకటస్వామి స్మారక మంచిర్యాల నియోజకవర్గ స్థాయి క్రికెట్పోటీలు సోమవారం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్సింగరేణి ఠాగూర్స్టేడియంలో ప్రారంభం అయ్యాయి. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి టాస్వేసి పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని కొద్దిసేపు క్రికెట్ఆడారు. ముందుగా కాకా వెంకటస్వామి ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు.
అనంతరం మంచిర్యాల రాయల్స్, లక్సెట్టిపేట హీరోస్ టీమ్ ల మధ్య జరిగిన పోటీలో మంచిర్యాల రాయల్స్ విక్టరీ సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్సెట్టిపేట హీరోస్ టీం 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 100 రన్స్చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన మంచిర్యాల రాయల్స్9.3 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 103 రన్స్చేసి విజయం సాధించింది. ఎండి.సైఫ్అలీ 31 బాల్స్లో 62 రన్స్తో నాటౌట్గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్దక్కించుకున్నాడు. బౌలర్అశ్వీక్ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీశాడు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్చైర్మన్ సాగర్రెడ్డి, నిర్వాహకుడు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.