
కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లో ‘కాకా వెంకటస్వామి కప్’ పేరిట నిర్వహిస్తున్న క్రికెట్టోర్నమెంట్ సందడిగా సాగుతోంది. బుధవారం ఉదయం బెల్లంపల్లిలోని ఏఎంసీ-–2 గ్రౌండ్ లో జరిగిన ఫస్ట్మ్యాచ్లో భీమిని, కాసీపేట జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్చేసిన భీమిని టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన కాసీపేట టీమ్రెండు వికెట్లు కోల్పోయి కేవలం 6.4 ఓవర్లలోనే టార్గెట్ను చేజ్చేసింది.
కాసీపేటకు చెందిన రొడ్డ రేవంత్ 2 వికెట్లు తీయడంతోపాటు, 19 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఎ.తిరుపతి 38 పరుగులు చేశాడు. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో నెన్నెల, కన్నెపల్లి జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్చేసిన నెన్నెల టీమ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. పల్తాయ రాకేశ్ 43, శివ 20, చందు 19 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన కన్నెపల్లి టీమ్ 14.1 ఓవర్లలో 43 పరుగులకే ఆలౌట్ అయింది. కార్తీక్అనే బ్యాటర్21 పరుగులు చేశాడు. నెన్నెల టీంకు చెందిన పల్తాయ రాకేశ్ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
రామకృష్ణాపూర్ సింగరేణి స్టేడియంలో..
క్యాతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్స్టేడియంలో బుధవారం భీమారం, రామకృష్ణాపూర్రూరల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్టై అయింది. భీమారం టీమ్7 వికెట్లు, ఆర్కేపీ రూరల్ టీమ్8 వికెట్లు కోల్పోయి 141 పరుగులు సాధించడంతో నిర్వాహకులు డ్రాగా ప్రకటించారు. 66 పరుగులు చేసిన భీమారం ప్లేయర్ రంజిత్ మ్యాన్ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్పల్లె రాజు, లీడర్లు గోపతి రాజయ్య, నీలం శ్రీనివాస్గౌడ్, బత్తుల వేణు, సురేశ్ మెమోంటో అందజేశారు.