హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ భేటీ అయ్యారు. షెడ్యూల్డు కులాల (SC) వర్గీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ సిఫారసులపై మంద కృష్ణ మాదిగ, సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికలోని లోపాలను ఈ సందర్భంగా సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు మంద కృష్ణ. ఉపకులాల వర్గీకరణలో పలు సమస్యలను సీఎంకు వివరించారు.
వాటిని మరోసారి పరిశీలించాలని కోరారు. అసెంబ్లీలో చర్చించి, కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి న్యాయ కమిషన్ వేసి, నివేదికలను వేగంగా తీసుకుని, కేబినెట్లో చర్చించి, అసెంబ్లీలోనే నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ వివరించారు. దీనివల్ల ఎలాంటి న్యాయ పరమైన చిక్కులు లేకుండా చేశామని సీఎం పేర్కొన్నారు. వర్గీకరణకు తీర్మానం చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కొట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణపై ఉన్న సమస్యలు, అభ్యంతరాలను కేబినెట్ సబ్ కమిటీతో పాటు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని మంద కృష్ణ మాదిగకు సీఎం సూచించారు.
Also Read :- రాముని పేరుపై దాడులు చేస్తే సహించం
ఈ భేటీ అనంతరం మంద కృష్ణ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కమిట్ మెంట్ను మందకృష్ణ మాదిగ అభినందించారు. నిబద్ధతతో వర్గీకరణ ప్రక్రియను చేపట్టిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఒక సోదరుడిగా అండగా ఉంటానని అన్నారు. రాజకీయ ప్రయాజనాలకు అతీతంగా, మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే మంచి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మా్ర్పీఎస్ ఉద్యమానికి రేవంత్ రెడ్డి మొదటి నుంచి మద్దతు ఇస్తున్నారన్నారు.
షెడ్యూల్డు కులాల వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ గారి నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ సిఫారసులను శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి @revanth_anumula గారిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి #MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ గారు కలిశారు.
— Telangana CMO (@TelanganaCMO) February 11, 2025
కమిషన్ చేసిన సిఫారసుల్లో క్రీమీలేయర్… pic.twitter.com/6FKmslxJ9w