ఖైరతాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కవులు, కళాకారులను గుర్తించి ఇంటి స్థలం, రూ.కోటి నజరానా ఇస్తామంటూ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మార్పీఎస్వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చెప్పారు. అయితే ఆ జాబితాలో మాదిగ సామాజికవర్గ కళాకారులను విస్మరించారని విమర్శించారు.
మాదిగ కళాకారులతో గురువారం ఆయన సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన కళాకారుల సంఖ్యను పెంచాలన్నారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్చేస్తూ జనవరి 27న మాదిగ కళాకారులతో, -లక్ష డప్పులతో నెక్లెస్రోడ్డులో మహా ప్రదర్శన ఉంటుందన్నారు.
125 అడుగుల అంబేద్కర్విగ్రహం నుంచి నెక్లెస్రోడ్డు మీదుగా ట్యాంక్ బండ్ అంబేద్కర్విగ్రహం కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన తొలిదశ ఉద్యమకారిణి టీఎన్సదాలక్ష్మి జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. సమావేశంలో ఏపూరి సోమన్న, ఓయూ విద్యార్థినేత నలిగంటి శరత్, మాదిగ కళామండలి జాతీయ అధ్యక్షుడు ఎన్.వై.అశోక్మాదిగ, ఎమార్పీఎస్రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్మాదిగ తదితరులు పాల్గొన్నారు.