
యాదాద్రి, వెలుగు : బీజేపీతోనే సామాజిక న్యాయం జరిగిందని, జరుగుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ ఎన్నికల్లో అన్ని వర్గాల వారు బీజేపీకి అండగా నిలిచి గెలిపించాలని ఆయన కోరారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాజిక న్యాయం గురించి కాంగ్రెస్ ఉత్తమాటలే చెప్పిందని, బీజేపీ ఆచరణలో చూపుతున్నదన్నారు. రిజర్వేషన్లలో అన్యాయం జరిగిన విషయాన్ని 1965లో కాంగ్రెస్ వేసిన కమిషన్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కమిషన్ ఇచ్చిన నివేదికను కాంగ్రెస్ చెత్తలో వేసిందన్నారు. అప్పటి నుంచి జరుగుతన్న అన్యాయాన్ని సరిదిద్దాలనే తాము కోరుతున్నామని తెలిపారు.