మినరల్ వాటర్ ప్లాంట్ ​ప్రారంభం

మినరల్ వాటర్ ప్లాంట్ ​ప్రారంభం

శివ్వంపేట, వెలుగు: మండల కేంద్రంలో ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన మినరల్​వాటర్​ ప్లాంట్​ను దసరా రోజు మండల కాంగ్రెస్ నాయకుడు పులిమామిడి నవీన్ గుప్తా ప్రారంభించారు. తన  తల్లితండ్రులైన పులిమామిడి అంజమ్మ, మల్లేశం గుప్తా  జ్ఞాపకార్థం సొంత నిధులతో ఆయన ఈ ప్లాంట్​ను ఏర్పాటు చేశారు.  ఎవరూ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని తాగునీటిని ఉచితంగా తీసుకెళ్లవచ్చని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, పీఎన్​జీ యువసేన సభ్యులు పాల్గొన్నారు.