క్యాతనపల్లి రైల్వే గేట్​ ఓపెన్​..చొరవ చూపిన పెద్దపల్లి ఎంపీ, చెన్నూరు ఎమ్మెల్యే 

క్యాతనపల్లి రైల్వే గేట్​ ఓపెన్​..చొరవ చూపిన పెద్దపల్లి ఎంపీ, చెన్నూరు ఎమ్మెల్యే 

కోల్ బెల్ట్, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి చొరవతో మందమర్రి మండలం క్యాతనపల్లి రైల్వేగేట్​ను శుక్రవారం ఓపెన్​ చేశారు. రైల్వే ట్రాక్​ రిపేర్​కారణంగా ఈనెల 19 నుంచి 28 వరకు గేట్​ను మూసివేస్తున్నట్లు రైల్వే ఆఫీసర్లు ప్రకటించారు. అయితే, పదో తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బంది పడతారని కాంగ్రెస్​నాయకులు ఎంపీ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

స్పందించిన వారు దక్షిణ మధ్య రైల్వే ఆఫీసర్ల తో మాట్లాడారు. పరీక్షలు పూర్తయ్యేవరకు రైల్వే ట్రాక్​మరమ్మతులు నిలిపివేయాలని సూచించడంతో  గేట్​ఓపెన్​ చేశారు. టీపీసీసీ జనరల్​సెక్రటరీ పిన్నింటి రాఘునాథ్​రెడ్డి, కాంగ్రెస్​టౌన్​ ప్రెసిడెంట్ పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్​, సీనియర్​ నాయకుడు​ గాండ్ల సమ్మయ్య ఎంపీ, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.