మందమర్రిలో సింగరేణి కార్మికుడు మృతి.. మృతుని కుటుంబాన్ని ఆదుకుంటాం. . .

మందమర్రిలో సింగరేణి కార్మికుడు మృతి.. మృతుని కుటుంబాన్ని ఆదుకుంటాం. . .

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రజలకు అండగా ఉంటామని మరోసారి నిరూపించుకున్నారు. ఎవరు ఎలాంటి ఇబ్బందుల్లో తాము అండగా ఉంటామని రుజువు చేశారు.. పూర్తివివరాల్లోకి వెళ్తే...

మంచిర్యాల జిల్లాలో విషాద ఘటన నెలకొంది.  మందమర్రి సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న గని కార్మికుడు .... కోల్​ కట్టర్​మోకినపల్లి లక్ష్మణ్ మృతిచెందాడు.  ఈ క్రమంలో కేకే 5 గనిలోని మొదటి షిప్ట్​ సిబ్బంది విధులు బహిష్కరించి కార్మిక నేతలతో కలిసి కార్మికులు గేట్​ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు. 

 ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ, రాష్ట్ర కనీస వేతనాల కమిటీ సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ మృతుని కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేశారు.  మృతుని కుటుంబానికి అండగా ఉండి... అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు.