
రంజాన్పండుగ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం పట్టణంలోని సిటీలోని మండిబజార్ ఫుల్ బిజీగా కనిపించింది. ముస్లింలంతా బట్టలు, నిత్యావసర వస్తువులు, చెప్పులు, గాజులు, అత్తరులు.. ఇలా అవసరమైన వస్తువులను ఖరీదు చేస్తున్నారు. దీంతో మండిబబాజర్ అంతా జనంతో కిటకిటలాడుతోంది. హైదరాబాద్ చార్మినార్ తర్వాత ఎక్కువగా వస్తువులు వరంగల్ మండిబజార్లో కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా వస్తారు. దీంతో ఈ ప్రాంతం అంతా రద్దీగా మారింది.
- గ్రేటర్ వరంగల్, వెలుగు