సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు

సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు
  • రవి రహేజా రూ.5 కోట్లు, 
  • కేఎన్ఆర్ కంపెనీ రూ.2 కోట్లు

హైదరాబాద్, వెలుగు: వరద బాధితుల కోసం సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు అందుతున్నాయి. సీఎంఆర్ఎఫ్​కు ప్రముఖ వ్యాపారవేత్త రవి రహేజా రూ.5 కోట్లు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. కేఎన్ఆర్ కన్ స్ట్రక్షన్స్ లిమిటెడ్ కంపెనీ రూ.2 కోట్లు ఇచ్చింది. కంపెనీ ఎండీ నర్సింహా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జలంధర్ రెడ్డి సీఎం రేవంత్​ను కలిసి చెక్కు ఇచ్చారు. 

నాగార్జున కన్ స్ట్రక్షన్స్ కంపెనీ ఎండీ రంగరాజు, డైరెక్టర్ సూర్య రూ.కోటి, క్రెడాయ్ తరపున రూ.కోటి సీఎంఆర్ఎఫ్ కు అందించారు. 
ఇక వెల్లూర్ ఇనిస్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ ఫౌండర్ అండ్ చాన్స్ లర్ డాక్టర్ జి.విశ్వనాథన్, వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్ జూబ్లీహిల్స్ లో సీఎంను కలసి రూ.1.5 కోట్ల చెక్కును ఇచ్చారు.