
ఖిలావరంగల్/ కాశీబుగ్గ/ వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: ఉమ్మడి వరంగల్జిల్లా పరిధిలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు శనివారం కాంగ్రెస్పార్టీలో చేరారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్ బొల్లికుంట నుంచి బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు పసునూరి వేణుగోపాల్ (సాల్మన్) ఆధ్వర్యంలో వరంగల్ పార్లమెంటు ఇన్చార్జి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వరంగల్తూర్పు నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్నాయకుడు రాజనాల శ్రీహరి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. ములుగు జిల్లా వెంకటాపూర్మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన బీఆర్ఎస్ఎంపీటీసీ లక్ష్మి, ఇతర పార్టీల నాయకులు ములుగు జిల్లా కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.