సెప్టెంబర్ 21 నుంచి మావోయిస్టు పార్టీ వారోత్సవాలు

సెప్టెంబర్ 21 నుంచి మావోయిస్టు పార్టీ వారోత్సవాలు

ఖిలా వరంగల్( కరీమాబాద్ ), వెలుగు : సీపీఐ మావోయిస్టు పార్టీ 20వ వార్షికోత్సవాన్ని తెలంగాణలో సమరోత్సా హం పేరుతో నిర్వహించాలని అధికార ప్రతినిధి జగన్​తెలిపారు. గురువారం ఆయన ఒక లేఖను విడుదల చేసి మీడియాకు పం పించారు. మావోయిస్టు పార్టీ ఏర్పాటై ఈనెల 21 నాటికి 20 ఏండ్లు పూర్తవుతాయని.. ఈ రెండు దశాబ్దాల కాలంలో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ తెలంగాణలో పీడిత ప్రజల కోసం పార్టీ పని చేసిందని పేర్కొన్నారు.

మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ పై ఎదురొడ్డి పోరాడుతున్నామన్నారు. ‘ పీఎల్జీఏ, విప్లవ ప్రజానీకం ఐక్యమై ప్రజాయుద్దానికి బలమైన ప్రజా పునాదిని వేద్దాం.. పార్టీని, విప్లవోద్యమాన్ని కాపాడుకుందాం’ అని ఆయన లేఖలో  వెల్లడించారు.