
హిందువులు గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ సమయంలో ఎవరూ ఏ పని చేయరు. ఇక గర్భిణీ స్త్రీలు అయితే ఆ సమయంలో బెడ్ దిగరు.. కాలు కదపరు.. ఇక బ్రాహ్మణులు అనుష్ఠానం.. జపం చేసుకుంటారు. ఈ ఏడాది మార్చి 29న సూర్యగ్రహణం రాబోతుంది. ఆ రోజు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని జపం చేస్తే అనేక శుభఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ మంత్రాన్ని తెలుసుకుందాం. .
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యగ్రహణాన్ని చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ ఏడాది మార్చి 29న సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ రోజు మధ్యాహ్నం 2.21 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.16 గంటలకు ముగుస్తుంది. జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఆ రోజున గ్రహణం అయిన తరువాత దానధర్మాలు చేయడం చాలా మంచిదని చెబుతున్నారు.
గ్రహణం సమయంలో అనుష్ఠానం/జపం చేయడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. సూర్యగ్రహణ సమయంలో సూర్యుని మంత్రాన్ని పలుమార్లు చదవడం వలన చాలా ఉపయోగాలుంటాయి. సూర్య మంత్రాన్ని జపం చేయడం వలన కేరీర్.. వ్యాపారంలో అభివృద్ది ఉంటుంది. ఇంకా దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారు జపాన్ని చేయించుకుంటే తగ్గుతాయని చెబుతున్నారు.
Also Read : ఇంట్లోనే తయారు చేసుకునే ఈ మందు వాడితే.. దోమలు రమ్మన్నా రావు..
చదవాల్సిన సూర్య మూల మంత్రం: ఓం హ్రాం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః
ఈ బీజాక్షరాలను తప్పుల్లేకుండా పఠించాలి. ఇది చదవలేని వారు క్రింద తెలిపిన శ్లోకాన్ని పఠించాలి
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ ।
తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్
ఇవి సూర్యుడికి సంబంధించిన ప్రాథమిక మంత్రాలు. . సూర్యగ్రహణం రోజున మాత్రమే కాదు ఈ మంత్రాన్ని ఇతర రోజులలో కూడా జపించడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి.
సూర్యగ్రహణం రోజున మీరు ఈ సూర్య మంత్రాన్ని జపిస్తే.. అది జీవితంలో ఆనందం, శాంతిని తెస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. సూర్యుడిని జ్ఞానానికి అధిష్టాన దైవంగా కూడా పరిగణిస్తారు. కనుక సూర్యగ్రహణ సమయంలో సూర్యునికి సంబంధించిన మంత్రాన్ని జపిస్తే.. అది జ్ఞానాన్ని తెలివి తేటలను పెంచుతుంది. ఈ మంత్రాన్ని సూర్యగ్రహణం రోజు నుంచి ప్రారంభించి.. ప్రతిరోజూ లేదా ప్రతి ఆదివారం జపించడం అత్యంత ఫలవంతమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.