రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే డ్రైనేజీ పనులు

రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే డ్రైనేజీ పనులు

మరికల్, వెలుగు: మరికల్​ ఎస్సీ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల ఎస్సీ కార్పొరేషన్​ నిధులతో అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ పనులు చేయిస్తున్నట్లు కాంగ్రెస్​ జిల్లా నాయకులు సూర్యమోహన్​రెడ్డి తెలిపారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పనులను పరిశీలించారు. 

కేంద్ర ప్రభుత్వ నిధులతో పనులు చేస్తున్నారని బీజేపీ నాయకులు చెప్పడం అవాస్తవమని చెప్పారు. 12వ వార్డులో హనుమాన్​వాడ నుంచి పోచమ్మ గుడికి వెళ్లే రోడ్డుపై పైపులు వేయించి సమస్యను పరిష్కరించామని తెలిపారు. మాజీ ఎంపీటీసీ గోపాల్, పార్టీ నాయకులు హరీశ్​చారి, పి.రామకృష్ణ, చెన్నయ్య, జంగిడి ఆంజనేయులు, నాగరాజు ఉన్నారు.