
ప్రధాని నరేంద్ర మోదీని మరో అంతర్జాతీయ పురస్కారం వరించింది. మారిషస్ అత్యున్నత పురస్కారమైన ది గ్రాండ్కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ను ఆ దేశ ప్రధాని నవీ చంద్ర రామ్గులాం ప్రధాని మోదీకి ప్రదానం చేశారు.
ఇండియా– మారిషస్ మధ్య సంబంధాల పటిష్టతకు చేసిన విశేష కృషికిగాను మోదీని ఈ అవార్డుతో సత్కరించారు. ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారత ప్రధానిగా, ఐదో విదేశీ నేతగా మోదీ ఘనత సాధించారు.
ALSO READ | Success: ఆయుధ దిగుమతులపై సిప్రీ నివేదిక
1992, మార్చి 12న మారిషస్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకు మోదీతో కలిపి ఐదుగురు విదేశీ ప్రముఖులకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని మొదటిసారిగా 1998లో జాతి వివక్ష పోరాట యోధుడు నెల్సన్ మండేలా అందుకున్నారు.