
పత్తి కొనుగోళ్లకు ఆదిలాబాద్లోని మార్కెట్ యార్డు సర్వం సిద్ధమైంది. ఈనెల 23 నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో అమ్మకాలకు వచ్చే రైతుల కోసం అధికారులు అన్ని సదుపాయాలు కల్పించారు. మార్కెట్లో మంచినీటితో పాటు రాత్రి వేళల్లో బసచేయడానికి గెస్ట్ హౌస్లో ప్రత్యేకంగా బెడ్లు, పత్తి వాహనాలపై నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ కాంటాలతో పాటు వెయిట్ మెషీన్లను సిద్ధం చేశారు.- వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్