జీడీపీ వృద్ది అంచనా.. స్టాక్ మార్కెట్లకు జోష్​

జీడీపీ వృద్ది అంచనా.. స్టాక్ మార్కెట్లకు జోష్​
  • సెన్సెక్స్​ 741 పాయింట్లు అప్,​23,500 పైన నిఫ్టీ

న్యూఢిల్లీ: ఈసారి గ్రోత్​ ఆధారిత బడ్జెట్​ ఉంటుందని ఎకనామిక్ ​సర్వే సంకేతాలు ఇవ్వడంతో మార్కెట్లు శుక్రవారం పుంజుకున్నాయి. సెన్సెక్స్​741 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 23,500 ఎగువన ముగిసింది. సెన్సెక్స్​740.76 పాయింట్ల లాభంతో 77,500 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 846 పాయింట్ల వరకు దూసుకెళ్లింది. 

నిఫ్టీ 258.90 పాయింట్లు ర్యాలీ చేసి 23,508.40 వద్ద సెటిలయింది. ఇంట్రాడేలో 297 పాయింట్లు ఎగిసింది. సెన్సెక్స్​లో ఎల్​ అండ్​ టీ, నెస్లే, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, టైటాన్​, టాటా మోట ర్స్​, టాటా స్టీల్​, ఐటీసీ, మారుతి లాభపడ్డాయి. 

ఆసియాలో టోక్యో లాభపడగా, సియోల్ ​నష్టపోయింది. సెలవు వల్ల షాంఘై, హాంగ్​కాంగ్  ​మార్కెట్లు పనిచేయలేదు. యూరప్ ​మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. యూఎస్​ మార్కెట్లు గురువారం లాభపడ్డాయి. ఎఫ్​ఐఐలు గురువారం రూ.4,582.95 కోట్ల ఈక్విటీలను అమ్మారు.