చొప్పదండిలో పిల్లలు పుట్టడం లేదని వివాహిత ఆత్మహత్య 

చొప్పదండిలో పిల్లలు పుట్టడం లేదని వివాహిత ఆత్మహత్య 

చొప్పదండి, వెలుగు: సంతానం కలగడం లేదని మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై అనూష వివరాల ప్రకారం.. చొప్పదండిలోని సంతోష్​నగర్​కు చెందిన రాచకొండ మమత(25)కు కొత్తపల్లి మండలం చింతకుంటకు చెందిన రాచకొండ లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 2019లో పెండ్లయింది. వారికి సంతానం కలగకపోవడంతో కొన్ని రోజులుగా భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.

లక్ష్మణ్ మమతను శారీరకంగా మానసికంగా హింసిస్తున్నాడు. ఈక్రమంలో ఆమె ఈ నెల 8న పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇంట్లో బాధపడుతూ ఒంటరిగా ఎవరితో మాట్లాడకుండా ఉండేది. గురువారం సాయంత్రం తల్లి  పద్మ పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే సరికి బెడ్ రూమ్​లో సీలింగ్ ఫ్యాన్​కు మమత ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది.

కుటుంబ సభ్యులు ఆమెను కిందికి దించగా అప్పటికే చనిపోయింది. అల్లుడు లక్ష్మణ్ వేధింపులతోనే తన కూతురు చనిపోయిందని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ తెలిపారు.