బండతో కొట్టాడు.. స్క్రూడ్రైవర్ తో పొడిచాడు..

బండతో కొట్టాడు.. స్క్రూడ్రైవర్ తో పొడిచాడు..
  • బండతో కొట్టి.. స్క్రూడ్రైవర్​తో ముఖంపై పొడిచి.. స్పందనను చంపిన ఇంటర్ ఫ్రెండ్​

  • భర్తకు దూరంగా ఉంటుందని తెలిసి తరచూ వేధింపులు

  • తనను పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి.. ఒప్పుకోకపోవడంతో హత్య

మియాపూర్, వెలుగు:  హైదరాబాద్ మియా పూర్​ పరిధిలో ఇటీవల సంచలనం సృష్టించిన వివాహిత మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. లవ్​ను యాక్సెప్ట్​ చేయలేదని, పెండ్లి చేసుకోలేదనే కక్షతో  ఇంటర్ ఫ్రెండ్  విచక్షణారహితంగా రాయితో కొట్టి, స్క్రూడ్రైవర్​తో ముఖంపై పొడిచి చంపినట్లు తేల్చారు. మియాపూర్​ ఇన్​స్పెక్టర్ దుర్గా రామలింగ ప్రసాద్ ​తెలిపిన ప్రకారం.. దీప్తీశ్రీనగర్ కు చెందిన స్పందన(29), వినయ్​కుమార్, గచ్చిబౌలి సుదర్శన్​నగర్ ఆల్​ఎంఓయూ కాలనీకి చెందిన ఎం.మనోజ్​కుమా ర్(29) ఇంటర్​ మీడియట్ నుంచి ఫ్రెండ్స్. ఆ టైంలో మనోజ్ లవ్ ​ప్రపోజ్ చేయగా, స్పందన రిజెక్ట్ ​చేసింది. మనం ఫ్రెండ్స్​గానే ఉందామని చెప్పింది. తర్వాత వినయ్​కుమార్​ను ప్రేమించింది. 

2022లో పెద్దల అంగీకారంతో పెండ్లి చేసుకుంది. కొన్ని నెలలకే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులకు అప్లయ్​చేశారు. అప్పటి నుంచి స్పందన తన తల్లి, సోదరుడితో కలిసి దీప్తి నగర్ లోని సీబీఆర్​ఎస్టేట్ లో ఉంటోంది. వినయ్​కుమార్​అదే కాలనీలోని మరో ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో మనోజ్​కుమార్ స్పందనకు దగ్గరయ్యాడు. తరచూ స్పందన ఇంటికి వెళ్లి తన ప్రేమను యాక్సెప్ట్​చేయాలని, పెండ్లి చేసుకుంటానని వేధించేవాడు. 

స్పందన తిరస్కరించడంతోపాటు ఇతర ఫ్రెండ్స్, కొలీగ్స్​తో సన్నిహితంగా ఉండటాన్ని చూసి మనోజ్ జీర్ణించుకోలేకపోయాడు. స్పందనను చంపేయాలని డిసైడ్​అయ్యాడు. గత నెల 30న ఇంట్లో ఒంటరిగా నిద్రపోతున్న స్పందనపై దాడి చేశాడు. గ్రానైట్​రాయితో తలపై కొట్టి, స్క్రూడ్రైవర్​తో ముఖంపై పొడిచి చంపేశాడు. తర్వాత మెయిన్​డోర్​ను బయటి నుంచి లాక్​ చేసి పారిపోయాడు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో మియాపూర్​పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి ఫోన్ కాల్స్​డేటా, సీసీ ఫుటేజీల ఆధారంగా స్పందనను చంపింది మనోజ్​కుమార్ గా గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.