
న్యూఢిల్లీ: సోలార్ పవర్, బయోగ్యాస్ తదితర రెన్యువబుల్ఎనర్జీ ప్రాజెక్టుల కోసం రాబోయే మూడు సంవత్సరాల్లో రూ. 450 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రెన్యువబుల్ఎనర్జీ వర్టికల్లో రూ.120.8 కోట్లు పెట్టుబడి పెట్టింది. 2025 ఆర్థిక సంవత్సరం నుంచి మూడేళ్లలో ఈ పెట్టుబడిని నాలుగు రెట్లు పెంచి రూ. 450 కోట్లకు చేర్చనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఉత్పత్తి సామర్థ్యాన్ని 2030-–31 నాటికి రెట్టింపు చేస్తామని తెలిపింది. 2025 ఆర్థిక సంవత్సరంలో మనేసర్ ప్లాంటులోనే బయోగ్యాస్ ప్లాంట్ను ప్రారంభించనుంది.